క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.65 లక్షల మోసం
ABN , First Publish Date - 2022-06-15T03:41:31+05:30 IST
Hyderabad: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ చీటర్స్ ఓ అడ్వకేట్తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వకేట్ను సైబర్ చీటర్స్
Hyderabad: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ చీటర్స్ ఓ అడ్వకేట్తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వకేట్ను సైబర్ చీటర్స్ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేశారు. అనంతరం క్రిప్టో ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట కొంత పెట్టుబడి పెట్టిన అడ్వకేట్కు చీటర్స్ లాభాలు చూపించారు. పూర్తిగా నమ్మిన అడ్వకేట్ నుంచి విడతల వారీగా.. రూ.55 లక్షలు కాజేశారు.ఇదే తరహాలో హైదరాబాద్ హిమాయత్ నగర్కి చెందిన శ్రీనివాస్ వద్ద.. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.10 లక్షల మోసం చేశారు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.