డిగ్రీ కాలేజి నిర్మాణానికి కృషి : మంత్రి వనిత

ABN , First Publish Date - 2021-02-25T04:47:38+05:30 IST

:కొవ్వూరులో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తానేటి వనిత తెలిపారు.

డిగ్రీ కాలేజి నిర్మాణానికి కృషి : మంత్రి వనిత

కొవ్వూరు, ఫిబ్రవరి 24:కొవ్వూరులో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళాశాలలో 24 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, 13 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు భర్తీకి కేబినెట్‌ అమోదం తెలిపిందన్నారు. డిగ్రీ కాలేజి శాశ్వత భవనాల నిర్మాణానికి మున్సిపాల్టీకి చెందిన ఐదు ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే భవన నిర్మాణం చేపడతామన్నారు. నియోజకవర్గంలో పీఎంజీఎస్‌ఎం పథకం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రెండు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. చాగల్లు మండలం కలవలపల్లి నుంచి కోరుమామిడి (వయా తాడిమళ్ళ, చిక్కాల) వరకు 13.08 కిలో మీటర్లు రూ. 7.89 కోట్లు, తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి గూటాల వరకు 4.56 కిలోమీటర్లు రూ.2.44 కోట్లుతో నిర్మించేందుకు కేబినెట్‌ అమోదం తెలిపిందన్నారు.

Updated Date - 2021-02-25T04:47:38+05:30 IST