కరోనాతో భర్త మృతి.. తట్టుకోలేక...

ABN , First Publish Date - 2021-04-11T16:33:16+05:30 IST

కరోనా లక్షణాలతో భర్త మృతిచెందడాన్ని తట్టుకోలేని భార్య బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదానికి దారితీసింది. తిరు

కరోనాతో భర్త మృతి.. తట్టుకోలేక...


పెరంబూర్‌(చెన్నై): కరోనా లక్షణాలతో భర్త మృతిచెందడాన్ని తట్టుకోలేని భార్య బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదానికి దారితీసింది. తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలై సమీపం కోటమంగళం సెట్టిపాళయంకు చెందిన పెరియస్వామి (83), భార్య సుబ్బులక్ష్మి (62) గత నెల 22వ తేదీ వెల్లంచెట్టివలసు గ్రామంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లి 24వ తేదీ తమ ఇంటికి తిరిగొచ్చారు. అనంతరం కుమార్తె, ఆమె కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో పెరియస్వామి, సుబ్బులక్ష్మి కుడిమంగళం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 31వ తేదీ కరోనా పరీక్షలు చేయించుకోగా, ఇద్దరికీ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో, వారు ఇంట్లోనే క్వారంటైన్‌లో వుంటున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం గదిలో పెరియస్వామి అచేతనంగా పడి వుండడం గమనించిన సుబ్బులక్ష్మి, అతనిని పరీక్షించగా మృతిచెందాడని తెలిసింది. దీంతో, మనస్తాపం చెందిన ఆమె ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఉడుమలై అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకొని పీపీఈ సూట్లు ధరించి క్రేన్‌ సాయంతో బావిలోకి దిగి సుబ్బులక్ష్మి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కుడి మంగళం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-04-11T16:33:16+05:30 IST