ఏపీకి పరిశ్రమలు వస్తాయన్నారు.. అంతలోనే ఇలా..: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-21T18:23:06+05:30 IST

గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, కార్యకర్తలు, స్నేహితులు మేకపాటి గెస్టు హౌస్‌కు తరలి వస్తున్నారు.

ఏపీకి పరిశ్రమలు వస్తాయన్నారు.. అంతలోనే ఇలా..: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, కార్యకర్తలు, స్నేహితులు మేకపాటి గెస్టు హౌస్‌కు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. రాజకీయాల్లో గౌతమ్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. ఆయన వద్దకు ఎవరు వచ్చినా సహాయం చేసేవారని, అటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమన్నారు. దుబాయ్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చిన ఆయన ఏపీకి పరిశ్రమలు వస్తాయని తెలిపారన్నారు. అంతలోనే ఇలా జరగడం నెల్లూరు జిల్లాకు, పార్టీకి తీరని లోటని అన్నారు.


ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. వారం రోజులు దుబాయ్ పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్ వచ్చారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల అయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. పోస్టు కరోనా లక్షణాల్లో భాగంగా గుండెపోటుకు కారణం కావచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-02-21T18:23:06+05:30 IST