AP: కొండపల్లిలో రెండో రోజు ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-23T16:02:51+05:30 IST

కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై రెండోరోజు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP: కొండపల్లిలో రెండో రోజు ఉద్రిక్తత

విజయవాడ: కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై రెండో రోజు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముళ్ల కంచెలను దాటుకొని వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ప్రస్తుతం కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం పరిసర ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అంతకుముందు ఉదయం ఎంపీ కేశినేని నానితో కలిసి టీడీపీ కౌన్సిలర్లు ఉదయం 9:40 గంటలకు కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలకు చైర్మన్ ఎన్నిక ప్రారంభంకానుంది.

Updated Date - 2021-11-23T16:02:51+05:30 IST