పెంచలస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-10-03T05:09:42+05:30 IST
కోనలో పెంచలస్వామి, ఆదిలక్ష్మి, ఆంజనేయ స్వామి వార్లను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టీ.రాజశేఖరరావు ఆదివారం దర్శించుకుని పూజలు నిర్వహించారు.
రాపూరు, అక్టోబరు 2: కోనలో పెంచలస్వామి, ఆదిలక్ష్మి, ఆంజనేయ స్వామి వార్లను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టీ.రాజశేఖరరావు ఆదివారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కల్యా ణ మండపంలో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శ్రీవారి శేషవస్త్రాలు అంద జేశారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి, ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.