కొమురం భీం ప్రాజెక్ట్ నుండి 295 క్యూసెక్కుల నీరు విడుదల
ABN , First Publish Date - 2020-10-23T16:28:22+05:30 IST
కొమురంభీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
కొమురం భీం ఆసిఫాబాద్: కొమురంభీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఒక గేటు ద్వారా 295 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మీటర్లకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 241.500 మీటర్లుగా ఉంది.