నందిపాడులో బయటపడిన పురాతన బావి
ABN , First Publish Date - 2020-11-24T06:07:20+05:30 IST
ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న సమయంలో సుమారు 200 ఏళ్ల క్రితం నాటి పురాతన బావి బయట పడింది.
- పునాది తవ్వుతుండగా..!
కొలిమిగుండ్ల, నవంబరు 23: ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న సమయంలో సుమారు 200 ఏళ్ల క్రితం నాటి పురాతన బావి బయట పడింది. కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్రిబో యిన గంగాధర్ ఇంటి ఆవరణలో ఉన్న కల్లంలో ఈ పురాతన బావి బయట పడింది. వారసత్వంగా వచ్చిన కల్లంలో ఇంటి నిర్మాణం కోసం ఆదివారం నుంచి పునాదులు తవ్విస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద రాతిబండలు కనిపించాయి. అందులో ఒకటి తొలగించగా బండ కింద పెద్ద గొయ్యి కనిపిచింది. దీంతో గ్రామ ప్రజలందరూ గుమిగూడి ఆసక్తిగా చూశారు. మిగతా బండలను తొలగించడంతో చుట్టూ కటకం కనిపించింది. దీంతో బావి అని గుర్తించారు. పూర్వీకులు బావి తవ్విన అనంతరం కొన్నాళ్లకు వేసి పూడ్చివేసి ఉంటారని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.