Kodanadu వ్యవహారం.. మాజీ ఎమ్మెల్యేని విచారించిన ప్రత్యేక బృందం
ABN , First Publish Date - 2022-07-13T14:06:46+05:30 IST
కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని ప్రత్యేక బృందం మళ్లీ విచారించింది. నీలగిరి జిల్లా కోతగిరి
పెరంబూర్(చెన్నై), జూలై 12: కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని ప్రత్యేక బృందం మళ్లీ విచారించింది. నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ చెందిన కొడనాడు ఎస్టేట్లో 2017లో వాచ్మెన్ హత్య, దోపిడీ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో సయాన్, వాళయార్ మనోజ్ సహా పదిమందిని కోతగిరి పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ కేసు విచారణ ఊటీ కోర్టులో జరుగుతోంది. తాజాగా ఈ కేసు పునర్విచారణకు దక్షిణ మండల ఐజీ సుధాకర్ నేతృత్వంలో ఏర్పాటైన ఐదు ప్రత్యేక బృందాలు విచారణ వేగవంతం చేశాయి. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఆయన కుమారుడు అశోక్బాబును ప్రత్యేక బృందం విచారించింది. కాగా, రెండు నెలల కిత్రం వీరిదద్దరినీ ప్రత్యేక బృందం విచారించింది.