216 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-10-01T08:44:08+05:30 IST
జిల్లాలో బుధవారం 216 మందికి కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్లో ప్రకటించారు.
ఇద్దరి మృతి.. 464కు చేరిన మరణాలు
కర్నూలు(హాస్పిటల్), సెప్టెంబరు 30: జిల్లాలో బుధవారం 216 మందికి కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్లో ప్రకటించారు. దీంతో బాధితుల సంఖ్య 56,158కి చేరింది. వీరిలో 1714 మంది వివిద కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 56,980 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, మరణాల సంఖ్య 464కు చేరింది.