వైసీపీపై యువత తిరగబడే రోజులొచ్చాయి
ABN , First Publish Date - 2021-09-29T05:47:52+05:30 IST
కాకినాడ సిటీ, సెప్టెంబరు 28: ఉద్యోగాలిస్తామని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంపై యువత తిరగబడే రోజులు తలెత్తాయని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎ్సఎఫ్) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితు
సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 28: ఉద్యోగాలిస్తామని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంపై యువత తిరగబడే రోజులు తలెత్తాయని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎ్సఎఫ్) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన గౌస్ మొహిద్దీన్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మరుకుర్తి తేజ, కాకినాడ సిటీ అధ్యక్షుడిగా నియమితులైన నీలకాయల సన్ని టీడీపీ జిల్లా కార్యాలయంలో కొండబాబును మంగళవారం మర్యాద పూర్వకంగా కలవగా వారికి పూలమాలలు వేసి అభినందించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఎస్కే.వల్లీ, జానీ, ధనుష్, కాలీషా, బూడుపు మధు, ఎండీ అన్సర్, ఎస్కె.రహీమ్, అన్వర్, కొల్లాబత్తుల అప్పారావు, సీకోటి అప్పలకొండ, పలివెల రవి, వొమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ పాల్గొన్నారు.