చదువుకోవాలని మందలించినందుకు తండ్రిని చంపేశాడు

ABN , First Publish Date - 2021-04-22T07:20:40+05:30 IST

చదువుకోవాలని మందలించినందుకు కొడుకు తండ్రిని చంపిన సంఘటన మండలంలోని పాములపాడులో బుధవారం చోటుచేసుకుంది.

చదువుకోవాలని మందలించినందుకు తండ్రిని చంపేశాడు

మాడ్గులపల్లి, ఏప్రిల్‌ 21 : చదువుకోవాలని మందలించినందుకు కొడుకు తండ్రిని చంపిన సంఘటన మండలంలోని పాములపాడులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాములపాడు గ్రామానికి చెందిన బంటు ఎల్లయ్య(45) తన కొడుకు నాగేందర్‌ను ప్రస్తుతం కళాశా ల లేదు కాబట్టి కనీసం ఇంటి వద్దన్నైనా చదువుకో లేకపోతే పొ లం దగ్గరకు వచ్చి పనులైనా చూసుకో అని మందలించాడు. దీం తో వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో నాగేందర్‌ చేతిలో ఉన్న కత్తెరతో తండ్రి ఎల్లయ్య గొంతులో పొడిచాడు. దీంతో ఎల్లయ్యకు తీవ్ర గాయం కావడంతో అపస్మారకస్థితికి చేరుకోవడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతునికి భార్య, కొడుకు, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తమ్ముడు సైదులు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. 

Updated Date - 2021-04-22T07:20:40+05:30 IST