కోవిడ్ నివారణ చర్యలపై ఎంపీ నామా ఆరా
ABN , First Publish Date - 2020-03-29T11:45:21+05:30 IST
కరోనా నివారణ చర్యలపై ఎంపీ నామా నాగేశ్వరావు బోనకల్ మండలంలోని ప్రజా ప్రతినిధులతో ఆరా తీశారు. ప్రజలు
బోనకల్, మార్చి 28: కరోనా నివారణ చర్యలపై ఎంపీ నామా నాగేశ్వరావు బోనకల్ మండలంలోని ప్రజా ప్రతినిధులతో ఆరా తీశారు. ప్రజలు సామాజిక దూరం పాటించే చర్యలతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ తదితర ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తమ దృష్టికి తీసుకు రావాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండేలా చూడాలని తెలిపారు.