‘క్రిమి సంహారం’ కవితా సంకలనం ఆవిష్కరణ
ABN , First Publish Date - 2020-03-29T11:48:05+05:30 IST
‘క్రిమి సంహారం’ కవితా సంకలనం ఆవిష్కరణ
ఖమ్మం అర్బన్, మార్చి 28: కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.. ఖమ్మం నగరానికి చెందిన కవయిత్రి సుభాషిణి తోట సంపాదకత్వంలో వెలువరించిన కరోనా వైరస్ అవగాహనా కవితా సంకలనం ‘ప్రపంచయుద్ధం క్రిమి సంహారం’ పుస్తకాన్ని శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు... ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ .. కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన పెంపొందేకు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది కవులు తమ కవిత్వాన్ని అందించటం హర్షణీయమన్నారు.. కార్యక్రమంలో సీనియర్ కవి కపిల రాంకుమార్, కవి, తోట సుభాషిణి, కాళోజీ అవార్డు గ్రహీత సీతారాం పాల్గొన్నారు.