కేజీబీవీలలో 1507ఖాళీలు: జీసీడీవో ఉదయశ్రీ
ABN , First Publish Date - 2021-06-17T05:04:02+05:30 IST
జిల్లాలోని వివిధ మండలాల్లోని కేజీబీవీల్లో వివిధ తరగతులకు చెందిన 1507 ఖాళీలున్నట్టు జీసీడీవో ఉదయశ్రీ తెలిపారు.
ఖమ్మంఖానాపురంహవేలి, జూన్16: జిల్లాలోని వివిధ మండలాల్లోని కేజీబీవీల్లో వివిధ తరగతులకు చెందిన 1507 ఖాళీలున్నట్టు జీసీడీవో ఉదయశ్రీ తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలనే ఉద్దేశంతో కేజీబీవీలను నెలకొల్పింది.అందులో విద్యార్థులకు కేజీటు పీజీ వరకు అత్యుత్తమ విద్యతో పాటు వసతి, పౌష్టికాహారం అందిస్తోంది. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించేందుకు అత్యుత్తమ అధ్యాపక బృందం ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ మండల పరిధిలోని కేజీబీవీల్లో చేరాలని సూచించారు. 6తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు మండలాల వారీగా ఖాళీల వివరాలు వెల్లడించారు. బోనకల్106, చింతకాని 98, ఏన్కూరు105, కామేపల్లి 199, ఖమ్మంఅర్బన్ 110, కొత్తూరు 54, కొణిజర్ల 152, కూసుమంచి94, ముదిగొండ 115, పెనుబల్లి 111, రఘునాధపాలెం 76, సింగరేణి 92, తిరుమలాయపాలెం 81, ఎర్రుపాలెం 115 ఖాళీలు ఉన్నాయని జీసీడీవో ఉదయ శ్రీతెలిపారు.