కేరళలో రికార్డు స్థాయిలో వెలుగు చూసిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-05T02:07:55+05:30 IST

కరోనా కరోనా కేసుల సంఖ్య శనివారం 5 వేల మార్కును దాటేసింది. తాజాగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 240

కేరళలో రికార్డు స్థాయిలో వెలుగు చూసిన కరోనా కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల సంఖ్య శనివారం 5 వేల మార్కును దాటేసింది. తాజాగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 240 కేసులు నమోదయ్యాయి. ఒక రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసుల్లో 152 ఇతర దేశాల నుంచి వచ్చిన వారివి కాగా, మిగతావి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివని ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. నేడు నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,204కు పెరిగింది. నేడు కొత్తగా 209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వివిధ జిల్లాల్లో ఇంకా 1.77 లక్షల మంది పర్యవేక్షణలో ఉన్నారు. 1,74,844 మంది హోం/ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్‌లో ఉండగా, 2,915 మంది వివిధ ఆసుపత్రులలో ఉన్నారు. నేడు కొత్తగా 367 మంది ఆసుపత్రిలో చేరినట్టు మంత్రి తెలిపారు.  

Updated Date - 2020-07-05T02:07:55+05:30 IST