తక్కువ వడ్డీకి కేడీసీసీబీ రుణాలు
ABN , First Publish Date - 2022-06-25T06:21:51+05:30 IST
జిల్లా కేడీసీసీ బ్యాంకుల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి తెలిపారు.
ఎమ్మెల్యే రక్షణనిధి
ఎ.కొండూరు, జూన్ 24 : జిల్లా కేడీసీసీ బ్యాంకుల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి తెలిపారు. ఎ.కొండూరులో పీఏసీఎస్లో రూ.18.50 లక్షలతో నిర్మించిన గిడ్డంగిని శుక్రవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయా డనికి కృషిచేస్తుందన్నారు. ఎకరానికి రూ.8 లక్షల నుంచి మార్కెట్ విలువను బట్టి 40 లక్షల రుణాలు అందిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేయాడానికి, ఎరువులు అమ్మకాల కోసం నూతన గిడ్డంగులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎంపీపీ నాగలక్ష్మి, సర్పంచ్ రజని, చైర్పర్సన్లు రాంబాబు, ఆంజనేయులు, జిల్లా డైరెక్టర్లు బి.రాణి, జి.రాణా, కంభంపాడు మేనేజర్ సత్యనారాయణ, ఎంపీడీవో నాగేశ్వరావు, తహసీల్ధార్ వీరాంజనేయప్రసాద్ పాల్గొన్నారు.