ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాట తప్పిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-08-16T03:48:33+05:30 IST

లక్షెట్టిపేట రూరల్‌, ఆగస్టు 15: రాష్ట్ర ప్రజలకు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి విమర్శించారు. లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర ముగింపు సభలో ప్రసంగించారు. మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే కావాలని తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తే దానిని గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాట తప్పిన కేసీఆర్‌
లక్షెట్టిపేటలో అజాదీ కా గౌరవ్‌ యాత్ర ముగింపు సభలో మాట్లాడుతున్న రోహిత్‌ చౌదరి

లక్షెట్టిపేట రూరల్‌, ఆగస్టు 15: రాష్ట్ర ప్రజలకు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న   కేసీఆర్‌ మాట తప్పారని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి విమర్శించారు.  లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర ముగింపు సభలో ప్రసంగించారు.   మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే కావాలని తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తే దానిని గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. కాం గ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ మంత్రి గడ్డం వినోద్‌, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-16T03:48:33+05:30 IST