కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఓ పోలీసు అధికారి మృతి

ABN , First Publish Date - 2020-10-20T07:09:40+05:30 IST

కశ్మీర్‌లో జరిగిన టెర్రరిస్టు దాడిలో ఓ పోలీసు అధికారి అమరుడయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్‌ అష్రా్‌ఫను సోమవారం హఠాత్తుగా కొందరు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. ముష్కరుల....

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఓ పోలీసు అధికారి మృతి

అనంత్‌నాగ్‌ (కశ్మీర్‌), అక్టోబరు 19: కశ్మీర్‌లో జరిగిన టెర్రరిస్టు దాడిలో ఓ పోలీసు అధికారి అమరుడయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్‌ అష్రా్‌ఫను సోమవారం హఠాత్తుగా కొందరు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. ముష్కరుల తూటాలకు తీవ్రంగా గాయపడ్డ ఆయన.. ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు. కాగా.. శోపియాన్‌ జిల్లా మెల్హోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో.. భద్రతాదళా లు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-10-20T07:09:40+05:30 IST