కార్తీక సందడి
ABN , First Publish Date - 2020-12-01T04:27:35+05:30 IST
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్తీకపౌర్ణమి వేడుకలను సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్తీకపౌర్ణమి వేడుకలను సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఆలయాలను విద్యుద్దీపాలు, పుష్పాలు, మామిడితోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలు చోట్ల దేవాలయాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీపారాధనతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి.