ప్రజావైద్యుడు బాపిరెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2020-11-01T06:29:16+05:30 IST

అనపర్తిలో ప్రజా వైద్యుడిగా వైద్యసేవలు అందిస్తున్న అనంతలక్ష్మి క్లినిక్‌ అధినేత డాక్టర్‌ కర్రి బాపిరెడ్డి(80) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతు న్న ఆయన ఆస్పత్రిలో మృతి చెందారు.

ప్రజావైద్యుడు బాపిరెడ్డి కన్నుమూత

అనపర్తి, అక్టోబరు 31: అనపర్తిలో ప్రజా వైద్యుడిగా వైద్యసేవలు అందిస్తున్న అనంతలక్ష్మి క్లినిక్‌ అధినేత డాక్టర్‌ కర్రి బాపిరెడ్డి(80) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతు న్న ఆయన ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కు మార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనపర్తిలోని ఐఎల్‌టీడీ ఫ్యాక్టరీలో వైద్యుడిగా సేవలందించారు. ఐఎంఏ అనపర్తి శాఖ అధ్యక్షుడిగాను సేవలందించారు. ఆయన సోదరుడు కర్రి రామారెడ్డి మానసిక వైద్యుడిగా పేరుపొందారు. డాక్టర్‌ బాపిరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి మూలారెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ తాడి రా మగుర్రెడ్డి, డాక్టర్‌ తేతలి సత్యనారాయణరెడ్డి, డాక్టర్‌ ఏఎస్‌ఎన్‌ మూర్తి, డాక్టర్‌ సర్ణలత ఈశ్వరరెడ్డి, డాక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి బాంధవి దంపతులు, డాక్టర్‌ రమాదేవి, డాక్టర్‌ కర్రి వెంకట సాయికృష్ణారెడ్డి, డాక్టర్‌ జీఎస్‌ఎన్‌రెడ్డి, డాక్టర్‌ నవీన్‌ సంతాపం తెలిపారు.

Updated Date - 2020-11-01T06:29:16+05:30 IST