హైకోర్టుకు 24 నుంచి సెలవులు

ABN , First Publish Date - 2021-12-20T16:56:27+05:30 IST

రాష్ట్ర హైకోర్టుకు ఈనెల 24 నుంచి జనవరి ఒకటవ తేదీ దాకా చలికాలం సెలవులు ప్రకటించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిజిస్ర్టార్‌ కేఎస్‌ భరత్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వెలువడిన

హైకోర్టుకు 24 నుంచి సెలవులు

బెంగళూరు: రాష్ట్ర హైకోర్టుకు ఈనెల 24 నుంచి జనవరి ఒకటవ తేదీ దాకా చలికాలం సెలవులు ప్రకటించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిజిస్ర్టార్‌ కేఎస్‌ భరత్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వెలువడిన ఉత్తర్వుల మేరకు బెంగళూరులోని హైకోర్టు ప్రధాన కేంద్రంతో పాటు కలబురిగి, ధారవాడలోని హైకోర్టు బెంచ్‌లకు సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. సెలవు రోజులలో రోజువారి కార్యకలాపాలు కొనసాగవని, కానీ 27వ తేదీన బెంగళూరులోని ప్రత్యేక కోర్టులు మాత్రం పనిచేస్తాయన్నారు. అత్యవసర కేసులు మాత్రమే విచారణలకు తీసుకోనున్నారు. కానీ కలబురిగి, ధారవాడ బెంచ్‌ మాత్రం పూర్తిగా పనిచేయవని ఉత్తర్వుల ద్వారా స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-20T16:56:27+05:30 IST