కర్ణాటకలోనే ఎందుకో?
ABN , First Publish Date - 2020-02-22T08:30:12+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ, సీఏఏ అమలుకు సిద్ధం కాగా దేశంలో ఎక్కడాలేని విధంగా కర్ణాటకలోనే పాకిస్థాన్ జిందాబాద్..
- ‘పాక్ జిందాబాద్’ నినాదాలు
బెంగళూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ, సీఏఏ అమలుకు సిద్ధం కాగా దేశంలో ఎక్కడాలేని విధంగా కర్ణాటకలోనే పాకిస్థాన్ జిందాబాద్... అనే నినాదాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో యడ్డీ సర్కారు ఇలాంటి వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కాగా పాక్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య చర్యను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె చేసిన తప్పు క్షమించరానిదని, ఆమెను చట్టప్రకారం శిక్షించాలని కోరారు. సీఎం యడియూరప్ప స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే అమూల్య వ్యాఖ్యల వెనుక ఉద్దేశమన్నారు.