పారిశుధ్య కార్మికులను తొలగిస్తే ఉద్యమం
ABN , First Publish Date - 2022-05-27T03:04:38+05:30 IST
కావలి పురపాలక సంఘంలో పనిచేస్తున్న దినసరి పారిశుధ్య కార్మికులను తొలగిస్తే ఉద్యమం తప్పదని సీఐటీయూ పట్టణ శాఖ గౌరవా
కావలి, మే 26: కావలి పురపాలక సంఘంలో పనిచేస్తున్న దినసరి పారిశుధ్య కార్మికులను తొలగిస్తే ఉద్యమం తప్పదని సీఐటీయూ పట్టణ శాఖ గౌరవాధ్యక్షుడు పీ. పెంచలయ్య పేర్కొన్నారు. దినసరి కార్మికులను పనిలో కొనసాగించాలని రెండు రోజులుగా సీఐటీయూ ఆఽధ్వర్యంలో చేస్తున్న పోరాటంలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, కమిషనర్ బీ శివారెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో పనులకు ఎవరూ రాని రోజుల్లో దినసరి పారిశుధ్య కార్మికులను నియమించుకోగా, వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనులు చేశారన్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఆగి పొమ్మని చెప్పటం సరికాదన్నారు. వారిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.