కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-04-19T06:04:59+05:30 IST

సెకండ్‌ ఇన్విటే షనల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ ఆధ్వర్యంలో సామర్లకోటలో నిర్వహించిన పోటీల్లో అన్ని రాష్ట్రాల నుంచి 800మంది బాలబాలికలు పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

రామచంద్రపురం, ఏప్రిల్‌ 18: సెకండ్‌ ఇన్విటే షనల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ ఆధ్వర్యంలో సామర్లకోటలో నిర్వహించిన పోటీల్లో అన్ని రాష్ట్రాల నుంచి 800మంది బాలబాలికలు పాల్గొన్నారు. రామచం ద్రపురం, ద్రాక్షారామ, వెంటూరు గ్రామాలకు చెందిన విద్యార్థులు జి.మోరి శ్యామల, ఎ.వెంకటశైలు, కె.శివమహేష్‌ కుమార్‌ గోల్డ్‌ మెడల్స్‌, స్పారింగ్‌ విభాగంలో కె.హేమలత, కె.ఝాన్సీరాణి, కె.ధర్నిధర్‌, సిల్వర్‌ మెడల్స్‌, జూనియర్‌ కాటా విభాగంలో కె.మల్లేష్‌, ఎం.రాము, ఎన్‌.రాణి బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారని కోచ్‌ బి.కె.రత్నం తెలిపారు. జూనియర్‌ స్సారింగ్‌ విభాగంలో డి.అవనిక బెస్ట్‌ ఫైటర్‌గా అవార్డ్‌  పొందింది. ఈ టోర్నమెంట్‌ రిఫరీలుగా ఎం.శేఖర్‌, బల్లిపాటి కెంపు రత్నం వ్యవహరించారు.  విద్యార్థులను లయన్‌ జి.వి.రావు, నల్లమిల్లి చంటిరెడ్డి, చింతా సుబ్బారెడ్డి, డాక్టర్‌ కె.వి.వి.సత్య నారాయణ, 7వ వార్డు కౌన్సిలర్‌ చింతపల్లి నాగేశ్వరరావు, ద్రాక్షారామ ఎస్‌ఐ ఎన్‌.రామకృష్ణ, పి.పాపారావు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-04-19T06:04:59+05:30 IST