కాపు జేఏసీ నాయకుల పరామర్శ
ABN , First Publish Date - 2022-05-23T06:34:56+05:30 IST
కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకులను కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు పరామర్శించారు.
పి.గన్నవరం, మే 22: కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకులను కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులపై విచక్షణారహితంగా ఎస్ఐ లాఠీతో కొట్టడం చాలా దారుణమన్నారు. ఈఘటనకు కారుకులైన అధికారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరతామ న్నారు. పరామర్శించిన వారిలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గాసి సుబ్రహ్మణ్యం, నందం శ్రీనివాస్, ముద్రగడ్డ వెంకటరమణరావు ఉన్నారు. కొత్త పేట ప్రభుత్వాసుపత్రి వైద్యుల సూచనల మేరకు వారిని మెరుగైన వైద్యం కోసం బంధువులు అమలాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.