AP News: చరిత్రహీనుడిగా జగన్ నిలిచిపోతారు: కన్నా
ABN , First Publish Date - 2022-09-13T17:23:23+05:30 IST
రాజధాని మార్చడం ద్వారా సీఎం జగన్ చరిత్రహీనుడిగా నిలిచిపోతారని కన్నా లక్ష్మినారాయణ అన్నారు.
గుంటూరు జిల్లా (Guntur Dist.): ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) మార్చడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చరిత్రహీనుడిగా నిలిచిపోతారని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ (Kanna Lakshminarayana) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం నియంతృత్వ ధోరణి చాటుకున్నారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన శాడిస్టిక్ ప్రవర్తన చూపించారని, సీఆర్డీఏ చట్టం మార్చవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని.. అయినా ప్రభుత్వంలో మార్పులేదని కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు.