కనకదుర్గ అమ్మవారికి గాజుల అలంకరణ

ABN , First Publish Date - 2022-08-12T05:21:23+05:30 IST

శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరాంపురంలోని శ్రీచక్రసహిత కనకదుర్గ అమ్మవారికి 50వేల గాజులతో ప్రత్యేక అలంకారం చేశారు.

కనకదుర్గ అమ్మవారికి గాజుల అలంకరణ
గాజులు, పూల అలంకరణలో కనకదుర్గ అమ్మవారు

భీమవరం టౌన్‌, ఆగస్టు 11: శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరాంపురంలోని శ్రీచక్రసహిత కనకదుర్గ అమ్మవారికి  50వేల గాజులతో ప్రత్యేక అలంకారం చేశారు. ఆలయ అర్చకులు బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యం, సత్య ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభి షేకాలు నిర్వహించారు. నవార్ణార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం 500 కేజీల పసుపు, 500 కేజీల కుంకుమతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జోశ్యుల మల్లికార్జునరావు, కార్యదర్శి లంకా నాగరాజు కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:21:23+05:30 IST