‘ఆత్మ నిర్భర్ భారత్’తో ఏపీకి ఎన్నో ప్రయోజనాలు : హరిబాబు

ABN , First Publish Date - 2020-07-09T22:47:49+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సంక్షోభంతో కుదేలైన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం

‘ఆత్మ నిర్భర్ భారత్’తో ఏపీకి ఎన్నో ప్రయోజనాలు : హరిబాబు

విశాఖపట్నం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సంక్షోభంతో కుదేలైన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్యాకేజీ విషయమై బీజేపీ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతోందని హరిబాబు వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడిన అన్ని వర్గాలను అదుకోవడమే ఈ ప్యాకేజీ లక్ష్యమని హరిబాబు మరోసారి స్పష్టం చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ఈ ప్యాకేజీ ఎంతో దోహదం చేస్తోందన్నారు.

Updated Date - 2020-07-09T22:47:49+05:30 IST