కామాక్షితాయి సేవలో కందుకూరు డీఎస్పీ
ABN , First Publish Date - 2022-05-24T03:35:08+05:30 IST
జొన్నవాడలోని మల్లికార్జునస్వామి, కామాక్షితాయి అమ్మవార్లను సోమవారం కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు దర్శించుకు
బుచ్చిరెడ్డిపాళెం,మే23: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి, కామాక్షితాయి అమ్మవార్లను సోమవారం కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ ఈవో, ఏసీ, డీ వెంకటేశ్వర్లు డీఎస్పీని స్వాగతించారు. అర్చకులు డీఎస్పీ గోత్రనామాలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఈవో శాలువాతో సత్కరించారు. డీఎస్పీ వెంట బుచ్చి ఎస్ఐ కే. వీరప్రతాప్, సిబ్బంది తదితరులు ఉన్నారు.