Kamareddy: ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

ABN , First Publish Date - 2022-04-04T16:03:17+05:30 IST

జిల్లాలోని బీబీపేటలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై రవి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Kamareddy: ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

కామారెడ్డి: జిల్లాలోని బీబీపేటలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై రవి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామ వాసిగా గుర్తించారు. బీబీపేట్‌లో ఉండే తన అక్క ఇంటికి వచ్చి ఈ దారుణానికి యత్నించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-04-04T16:03:17+05:30 IST