Kamareddy: పంట పొలాల్లో హరితహారం మొక్కలు...రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2021-07-31T14:54:40+05:30 IST
జిల్లాలోని రామారెడ్డి శివారులో రోడ్డు పక్కన రైతుల భూముల్లో అధికారులు హరితహారం మొక్కలు నాటుతున్నారు.
కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి శివారులో రోడ్డు పక్కన రైతుల భూముల్లో అధికారులు హరితహారం మొక్కలు నాటుతున్నారు. పంట పొలాల్లో మొక్కలు నాటడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు డబ్బా పెట్టుకుని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన రైతులను స్థానికులు అడ్డుకున్నారు.