కమల్‌హాసన్ ముందంజ

ABN , First Publish Date - 2021-05-02T15:51:09+05:30 IST

మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ సౌత్‌లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

కమల్‌హాసన్ ముందంజ

కోయంబత్తూర్: మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ సౌత్‌లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. తన ప్రత్యర్థులు వనాతి శ్రీనివాసన్(బీజేపీ), మయూరా జయకుమార్(కాంగ్రెస్)ను వెనక్కి నెట్టి కమల్ ముందంజలో ఉండడం విశేషం. ఇక 2008లో డీలిమిటేషన్ జ‌రిగిన అనంతరం ఈ సీటులో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఆ రెండు ప‌ర్యాయాల్లోనూ ఏఐడీఎంకే అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఈసారి ఏఐడీఎంకే-బీజేపీలు కూటమిగా ఏర్పడిన నేప‌ధ్యంలో ఈ సీటు బీజేపీ చేతిలోకి వెళ్లింది. అటు డీఎంకే కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. దీంతో ఈసారి ఈ సీటును మయూరా జయకుమార్ కేటాయించారు. ఇక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్ ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారారు. 


Updated Date - 2021-05-02T15:51:09+05:30 IST