కమల్‌ పార్టీలో కుదిరిన సీట్ల సర్దుబాటు

ABN , First Publish Date - 2021-03-09T13:27:12+05:30 IST

సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌నీది మయ్యం కూటమిలో

కమల్‌ పార్టీలో కుదిరిన సీట్ల సర్దుబాటు

  • 154 స్థానాల్లో ఎంఎన్‌ఎం పోటీ


చెన్నై : సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌నీది మయ్యం కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. మక్కల్‌ నీదిమయ్యం 154 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి(ఎస్‌ఎంకే)కి 40, ఎస్‌ఆర్‌ఎం సంస్థల అధినేత పారివేందర్‌ పచ్చముత్తు నేతృత్వంలోని ఇందియ జననాయక కట్చి(ఐజేకే)కి 40 స్థానాలు ఖరారయ్యాయి. ఈ మేరకు మక్కల్‌ నీదిమయ్యం ప్రధాన కార్యదర్శి కుమారవేల్‌, సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌, ఐజేకే అధ్యక్షుడు రవి, డిప్యూటీ ప్రదాన కార్యదర్శి ఎం రవిబాబు సోమవారం రాత్రి భేటీ అయి పొత్తులు ఖరారు చేశారు. ఆ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

Updated Date - 2021-03-09T13:27:12+05:30 IST