‘పురం’లో కల్లూరు సుబ్బరావు జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2021-05-26T06:07:28+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కల్లూరు సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
హిందూపురం టౌన, మే 25: స్వాతంత్య్ర సమరయోధుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కల్లూరు సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న కల్లూరు సుబ్బారావు పార్కులో విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వక్తలు మాట్లాడుతూ కల్లూరు సుబ్బారావు హిందూపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. ఆయన స్వాతంత్య్ర సమరంలో పోరాడిన స్ఫూర్తిని ప్రభుత్వం గుర్తించి ఆయన పేరిట ఇచ్చిన స్థలాలను సైతం దానం చేసిన గొప్ప మహనీయుడు కల్లూరు సుబ్బరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్వి వేణు, అనీల్కుమార్, ఉదయ్కుమార్, మంజు, సమీ, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.