హెచ్‌సీఏ సభ్యుడిగా కలకుంట్ల మల్లికార్జున్‌

ABN , First Publish Date - 2021-06-20T05:19:23+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా సిద్దిపేట మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్‌, సిద్దిపేట జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్‌ నియమితులయ్యారు.

హెచ్‌సీఏ సభ్యుడిగా కలకుంట్ల మల్లికార్జున్‌

 అభినందించిన మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 19:  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా సిద్దిపేట మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్‌, సిద్దిపేట జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్‌ నియమితులయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరొద్దీన్‌ శనివారం సాయంత్రం  ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. మల్లికార్జున్‌ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి మల్లిఖార్జున్‌ చేసిన కృషికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. తన నియామకంపై మల్లికార్జున్‌ స్పందిస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సీఏ సభ్యుల సంఖ్యను పెంచిందని పేర్కొన్నారు. జిల్లా నుంచి తనతోపాటు వాల శరత్‌చంద్ర, మఠం భిక్షపతి, బుద్దుల శ్రవణ్‌రెడ్డి, దాదన్నగారి సందీ్‌పకుమార్‌, దావ సురే్‌షను హెచ్‌సీఏ ఏజీఎంలో సభ్యులుగా చేర్చారని వెల్లడించారు. తామందరిని వివిధ జిల్లాల అడ్‌హక్‌ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందన్నారు.  

Updated Date - 2021-06-20T05:19:23+05:30 IST