చంద్రబాబును కలిసిన కళా
ABN , First Publish Date - 2021-03-06T05:51:38+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు శుక్ర వారం విశాఖలో కలిశారు.
రాజాం రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు శుక్ర వారం విశాఖలో కలిశారు. జిల్లాలోని మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు కళా వెంకటరావు శుక్రవారం రాత్రి ఆంధ్రజ్యోతికి తెలిపారు. జిల్లాలోని పాలకొండ నగర పం చాయతీ, పలాస, ఇచ్చాపురం మునిసిపాలిటీలను ఎలాగైనా కైవ శం చేసుకునే దిశగా పనిచేయాలని చంద్రబాబు సూచించారని కళా చెప్పారు.