టీడీపీ పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన
ABN , First Publish Date - 2022-05-25T05:54:14+05:30 IST
కాకినాడ సిటీ, మే 24: వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 39వ డివిజన్లో చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదును మంగళవారం ఆయన పరిశీలించా
కాకినాడ సిటీ, మే 24: వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 39వ డివిజన్లో చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ వైఫల్యాలను సభ్యత్వ నమోదు ద్వారా బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మల్లిపూడి నాగదీపిక, చిట్టూరి అభిషేక్, గడ్డం పూర్ణచంద్రశేఖర్, నరవ సుబ్రహ్మణ్యం, గుమ్మళ్ల చిన్న తదితరులున్నారు.