సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-08-09T06:52:43+05:30 IST

‘స్పందన’లో కమిషనర్‌ రమేష్‌ కార్పొరేషన్‌, ఆగస్టు 8: స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ కె.రమేష్‌ సూచించారు. నగరపా

సమస్యల పరిష్కారానికి చర్యలు

‘స్పందన’లో కమిషనర్‌ రమేష్‌ 

కార్పొరేషన్‌, ఆగస్టు 8: స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ కె.రమేష్‌ సూచించారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను సోమవారం ఆయన స్వీకరించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పారిశుధ్యం, వివిధ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. అర్జీలను సంబంధిత అధికారులకు ఇచ్చి పరిష్కరించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ నాగనరసింహారావు పాల్గొన్నారు.

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ సూచించారు. పరిసర ప్రాంతా లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్య నివారణకు సహకరించాలని తెలిపారు. రోడ్లపై పశువులు విచ్చలవిడిగా తిరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు.

Updated Date - 2022-08-09T06:52:43+05:30 IST