నెల్లూరు కోర్టులో ఫైల్స్ దొంగతనంపై స్పందించిన మంత్రి కాకాణి
ABN , First Publish Date - 2022-04-19T20:35:50+05:30 IST
నెల్లూరు: కోర్టులో ఫైల్స్ దొంగతనంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.
నెల్లూరు: కోర్టులో ఫైల్స్ దొంగతనంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఫైల్స్ చోరీ వెనుక కుట్ర ఉందన్నారు. ఓ పథకం ప్రకారమే నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే నన్ను బద్నాం చేయడానికే... కోర్టులో ఫైల్స్ చోరీ జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఆరోపణ చేసేవారు సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలన్నారు. సీబీఐ విచారణను తాను స్వాగతిస్తానన్నారు.
మాజీ మంత్రి అనిల్కుమార్తో తనకు విభేదాలు లేవని మంత్రి కాకాణి అన్నారు. అందరినీ కలుస్తామని, ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. తమ మధ్య విభేదాలు ఉన్నప్పుడు విద్రోహులు ప్రవేశిస్తారన్నారు. తన ప్లెక్సీలు చించి అనిల్కుమార్ యాదవ్పై... అలాగే అనిల్ ప్లెక్సీలు చించి తనపై ఆరోపణలు చేస్తారన్నారు. ఆనం వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.