బైక్‌తో సహా పాగేరు వంకలో పడ్డ భార్యాభర్తలు

ABN , First Publish Date - 2020-10-02T07:06:45+05:30 IST

కమలాపురం-ఖాజీపేట రహదారిలోని పాగేరు వంకలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మండల పరిధిలోని చిన్నచెప్పలి గ్రామానికి చెందిన శరత్‌చంద్రారెడ్డి (27), అతని భార్య ఐశ్వర్యతో కలిసి చాపాడు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా పాగేరు వంక లోలెవెల్‌ వంతెనపై రోడ్డు కనిపించక నీటిలోకి పడిపోయారు.

బైక్‌తో సహా పాగేరు వంకలో పడ్డ భార్యాభర్తలు

భర్త గల్లంతు, భార్యను కాపాడిన స్థానికులు



కమలాపురం, అక్టోబరు 1: కమలాపురం-ఖాజీపేట రహదారిలోని పాగేరు వంకలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మండల పరిధిలోని చిన్నచెప్పలి గ్రామానికి చెందిన శరత్‌చంద్రారెడ్డి (27), అతని భార్య ఐశ్వర్యతో కలిసి చాపాడు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా పాగేరు వంక లోలెవెల్‌ వంతెనపై రోడ్డు కనిపించక నీటిలోకి పడిపోయారు. శరత్‌చంద్రారెడ్డి నీటిలో కొట్టుకుపోగా అతడి భార్యను సమీప గ్రామస్థులు నీటిలో దిగి కాపాడారు.


శరత్‌చంద్రారెడ్డి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పీఆర్‌వోగా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రాజారెడ్డి, ఫైర్‌ అధికారి నాగేశ్వరరెడ్డిలు సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ టీం ద్వారా వంకలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిపడటంతో రిస్క్‌ ఆపరేషన్‌ను నిలిపివేశారు. 

Updated Date - 2020-10-02T07:06:45+05:30 IST