ప్రశాంతంగా ఎడ్‌సెట్‌

ABN , First Publish Date - 2020-10-02T07:07:50+05:30 IST

ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ ఎడ్‌సెట్‌-2020 పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 74 శాతం మంది హాజరయ్యారు. జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్ష జరిగింది.

ప్రశాంతంగా ఎడ్‌సెట్‌

 74 శాతం హాజరు


కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 1: ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ ఎడ్‌సెట్‌-2020 పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 74 శాతం మంది హాజరయ్యారు. జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షలకు జిల్లా నుంచి 711 మంది దరఖాస్తు చేసుకోగా 531 మంది (74 శాతం) హాజరయ్యారు. 180 మంది గైర్హాజరయ్యారు. ఎడ్‌సెట్‌ తాత్కాలిక జవాబు కీ శుక్రవారం ప్రకటించనున్నారు. 



ఏపీ లాసెట్‌ ప్రశాంతం 

ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి సంబంధించి గురువారం నిర్వహించిన ఏపీ లాసెట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 70 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (హైదరాబాదు) ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. మూడేళ్లు, ఐదేళ్లు ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో భర్తీ అయ్యేందుకు జరిగిన ఈ పరీక్షలకు జిల్లాలో 954 మంది హాజరు కావాల్సి ఉండగా 671 మంది (70 శాతం) హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - 2020-10-02T07:07:50+05:30 IST