ఆగిఉన్న లారీని ఢీకొన్న టెంపో... ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-09-27T12:33:09+05:30 IST
మండల పరిధిలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిల్ (25) అనే వ్యక్తి మృతి చెందగా, డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి.
ఒంటిమిట్ట, సెప్టెంబరు 26 : మండల పరిధిలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిల్ (25) అనే వ్యక్తి మృతి చెందగా, డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. వివ రాల్లోకి వెళితే.. రాజంపేట మండలం ఆకేపాడు గ్రామం నుంచి అరటికాయల లోడుతో నంద్యాలకు వెలుతున్న టెంపో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో టెం పోలో ఉన్న వ్యక్తి అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్కు స్వల్పగాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్రెడ్డి తెలిపారు.