కాల్వలో బయటపడ్డ మృతదేహం
ABN , First Publish Date - 2020-09-27T12:33:57+05:30 IST
చిన్నచౌకు పాత బైపాస్ సమీపంలో అరుం ధతీనగర్ వద్ద ఓ కాల్వ నీటిలో గుర్తు తెలియని మృతదేహం బయట పడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో రిమ్స్ సీఐ సత్యబాబు, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కడప (క్రైం), సెప్టెంబరు 26: చిన్నచౌకు పాత బైపాస్ సమీపంలో అరుం ధతీనగర్ వద్ద ఓ కాల్వ నీటిలో గుర్తు తెలియని మృతదేహం బయట పడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో రిమ్స్ సీఐ సత్యబాబు, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్పొరేషన్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికి తీయించి పరిశీలించారు.
ఎస్ఐ వివరాల మేరకు.. మృతదేహం నీటిలో ఉండడంతో పూర్తిగా కుళ్లిపోయి ఉందని, పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే చిన్నచౌకు పాత బైపాస్ పక్కన శ్మశాన వాటిక ఉండ డంతో అక్కడ పూడ్చిన శవం ఏదైనా వర్షాల కారణంగా కొట్టుకు వచ్చిందా, లేక ఎక్కడైనా కాల్వలో పడి కొట్టుకువచ్చిందా అన్న విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.