AP: నందం సుబ్బయ్య హత్యకేసుపై బీసీ జాతీయ కమీషన్ స్పందన
ABN , First Publish Date - 2021-09-03T19:18:21+05:30 IST
ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసుపై బీసీ జాతీయ కమీషన్ స్పందించింది.
కడప: ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసుపై బీసీ జాతీయ కమీషన్ స్పందించింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుండి కడప ఎస్పీ అన్బురాజన్, ప్రొద్దుటూరు ఎమ్మల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆయన బావ మరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమీషనర్ రాధాలకు బీసీ కమీషన్ నోటీసు జారీ చేసింది. ముగ్గరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాలని హతుడు సుబ్బయ్య భార్య అపరాజిత పోరాడుతున్నారు. ఇటీవల బీసీ జాతీయ కమీషన్కు అపరాజిత ఫిర్యాదు చేశారు. కేసు కు సంబందించిన ఫైల్స్తో డైరెక్టుగా హాజరుకావాలని ఎస్పీ అన్బురాజన్కు కమీషన్ నోటీసు పంపింది.