Kadapa జిల్లా కోర్టుకు వివేకా హత్య కేసు బదిలీ

ABN , First Publish Date - 2022-02-22T19:39:56+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది.

Kadapa జిల్లా కోర్టుకు వివేకా హత్య కేసు బదిలీ

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ  పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరగే విధంగా ఆదేశించారు. పులివెందుల కోర్టుకు హాజరైన నలుగురు నిందితులకు సీబీఐ అభియోగ పత్రాల వివరాలను మెజిస్ట్రేట్ తెలియజేశారు. 

Updated Date - 2022-02-22T19:39:56+05:30 IST