Kadapa: ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మరోసారి ఛాన్సలర్ చర్చలు
ABN , First Publish Date - 2022-03-22T17:01:37+05:30 IST
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో ఛాన్సలర్ చెంచురెడ్డి మరోసారి చర్చలు నిర్వహించారు.
కడప: జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో ఛాన్సలర్ చెంచురెడ్డి మరోసారి చర్చలు నిర్వహించారు. విద్యార్థినిల ప్రధాన డిమాండ్కు ఛాన్సలర్ అంగీకారం తెలిపారు. ఆర్కేవ్యాలి కొత్తభవనాల్లోనే గదులను కేటాయిస్తామని ఆయన ఒప్పుకున్నారు. అయితే ఒక్కొక్క గదిలో 10 మందికి కేటాయిస్తామని చెప్పారు. ఇతర సౌకర్యాలపై చర్చలు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కర దిశగా ట్రిపుల్ ఐటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.