ప్రతి టీడీపీ కార్యకర్తకూ న్యాయం చేస్తా

ABN , First Publish Date - 2022-08-17T05:15:55+05:30 IST

నీరు, చెట్టు పనులు చేసి బిల్లులు అందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం అందేలా కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి భోరోసా ఇచ్చారు.

ప్రతి టీడీపీ కార్యకర్తకూ న్యాయం చేస్తా
విజయవాడలో హైకోర్టు న్యాయవాదితో చర్చిస్తున్న గుండుమల తిప్పేస్వామి

‘నీరు-చెట్టు’ బిల్లులు అందేలా న్యాయ పోరాటం

టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

మడకశిర టౌన, ఆగస్టు 16 : నీరు, చెట్టు పనులు చేసి బిల్లులు అందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం అందేలా కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి భోరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా ఆ బిల్లులు ఆపేసిందని, ఆ బాధితులకు తాను అండగా ఉంటానని అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిని కలసి సమస్యను వివరించారు. కోర్టు ద్వారా ఆ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. సంబంధిత బిల్లు పత్రాలను ఆ న్యాయవాదికి అందించి కోర్టులో పిటీషన దాఖలు చేయాలని కోరారు. అందుకు సంబంధించిన ఖర్చులను తానే భరించనున్నట్లు తెలిపారు.  నెల రోజుల లోపల కోర్టు ఉత్తర్వుల ద్వారా న్యాయం జరిగేలా చేస్తానని న్యాయవాది భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2022-08-17T05:15:55+05:30 IST