చందన్వెళ్లి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2022-08-10T06:17:29+05:30 IST
చందన్వెళ్లి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
షాబాద్, ఆగస్టు 9: చందన్వెళ్లిలో సర్వే నెంబర్ 190లో అవకతవకలు జరిగాయని, బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మంగళవారం హైతాబాద్లో పదో రోజు దీక్ష నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ.. చందన్వెళ్లిలో నిజమైన రైతులకు పరిహారం అందలేదన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. రైతులు అంజనేయులు, అనంతయ్య, బాలయ్య, అనంతం, శోభ, నర్సింహులు, వెంకటయ్య, రవి, యాదమ్మ, భీములు తదితరులు పాల్గొన్నారు.