విద్యార్థుల మృతిపై న్యాయమూర్తి విచారణ
ABN , First Publish Date - 2022-01-29T05:51:13+05:30 IST
బోడిగూడెంలో నలుగురు విద్యార్థుల మృతిపై సీనియర్ సివిల్ న్యాయమూర్తి బాలకృష్ణయ్య శుక్రవారం విచారణ చేపట్టారు.
కొయ్యలగూడెం, జనవరి 28: బోడిగూడెంలో నలుగురు విద్యార్థుల మృతిపై సీనియర్ సివిల్ న్యాయమూర్తి బాలకృష్ణయ్య శుక్రవారం విచారణ చేపట్టారు. నవంబర్లో నలు గురు విద్యార్థులు మృతి చెంద డంతో తగు విచారణ జరగాల ని గ్రామస్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయమూర్తి బాల కృష్ణయ్య బోడిగూడెం గ్రామస్థులు, మృతుల తల్లిదండ్రులు, అధికారులను విచారించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వైద్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ నాగమణి, సర్పంచ్ గడ్డియ్య, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.